Tuesday, April 16, 2024
- Advertisement -

నిత్యానందతో చిన్మయి.. ఫోటో వైరల్.. క్లారిటీ..!

- Advertisement -

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద సంబంధించిన ఓ ఫోటో వైరల్ కావడంతో దానిపై ఆమె వివారణ ఇచ్చింది. అది మార్పింగ్ ఫోటో అని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఇటీవలే లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో నిందితుడైన గురువు నిత్యానందతో చిన్మయి, ఆమె తల్లి కలిసి ఉన్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ ఫోటో గురించి ఆమెని నెటిజన్లు ప్రశ్నించడంతో.. ఆమె స్పందించక తప్పలేదు.

ఈ ఫోటో నకిలీదని నిర్ధారించిన తర్వాత ఈ అభిమానులు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ ట్వీట్‌ చేసింది చిన్మయి. కావాలనే ఇలా చేస్తున్నారు అని కోపడింది. ఇక తన కుమార్తెలను నిత్యానంద ఆశ్రమంలో చట్టవిరుద్దంగా నిర్భంధించి.. వేధింపులకు గురిచేశారంటూ ఒక కుటుంబం చేసిన ఆరోపణలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. దాంతో.. ‘సేవ్‌ గరల్స్ ఫ్రమ్‌ నిత్యానంద’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విటర్‌లో బాగా ట్రెండ్ అయింది. అయితే ఇలాంటి వాటిపై స్పందించే చిన్మయి.. ఈ సమస్య గురించి కూడా స్పందించింది.

మతపరమైన స్వాములు, భక్తి ముసుగులో జరుగుతున్న ఇలాంటి దారుణాలు చాలాసార్లు అధారాలతో సహా బయటకు వస్తున్న ప్రజలు అర్దం చేసుకోలేక వారి మాయలో పడిపోతున్నారని చిన్మయి ట్వీట్ చేసింది. ఇందుపు స్పందించిన ఓ నెటిజన్.. నిత్యానంద నుంచి చిన్మయి, ఆమె తల్లి ప్రసాదం స్వీకరిస్తున్నట్టుగా ఉన్న ఒక ఫేక్‌ ఫోటో షేర్‌ చేయడంతో దుమారం రేగింది. తర్వాత అది మార్ఫింగ్ ఫోటో అని చిన్మయి క్లారిటీ ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -