- Advertisement -
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఆడిపాడిన హీరోయిన్ ఇప్పుడు కర్ణాటకలో మంత్రి పదవిలో ఉన్నారు.చిరంజీవి హీరోగా వచ్చిన రాక్షసుడు సినిమాలో హీరోయిన్గా చేసిన జయమాల ప్రస్తుతం కన్నడ రాష్టంలో మంత్రిగా పని చేస్తున్నారు.కొత్తగా కొలువైన కుమార స్వామి మంత్రి వర్గంలో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు.
కన్నడ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షరాలిగా రాజకీయలలో చాలా యాక్టివ్గా ఉంటుంది జయమాల.తాజాగా జరిగిన కర్ణాటక ఎలెక్షన్స్లో గెలుపొందిన జయమాల మంత్రి వర్గంలో చోటు సంపాదించుకుంది.కన్నడ కేబినేట్ ఏకైక మహిళా మినిష్టర్గా చరిత్ర సృష్టించారు. జయమాల గతంలో శబరిమల అయ్యప్ప ఆలయం గర్భగుడిలోకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.