ఈ వారం బిగ్బాస్ హౌస్ నుంచి మరో వ్యక్తి బయటికి వచ్చేశారు.ఎలిమినేషన్లో భాగంగా దీప్తి సునైనా బిగ్బాస్ హౌస్ను వదిలి వచ్చేసింది.ఈ వారం దీప్తి సునైనాతో పాటు రోల్ రైడా,పూజా రామచంద్రన్,గీతా మాధురి,శ్యామల ఎలిమినేషన్కు నామినేట్ అయ్యారు.వీరిలో గీతా మాధురి,శ్యామలను శనివారం జరిగిన ఎపిసోడ్లోనే నాని సేవ్ చేయడం జరిగింది.ఇక ఆదివారం జరిగిన ఎపిసోడ్లో అందరు ఊహించినట్లే దీప్తి సునైన ఎలిమినేట్ అయిందనే విషయాన్ని నాని వెల్లడించారు.దీప్తి సునైనా హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో తనీష్ ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టాడు.
మిగత హౌస్మెట్స్ కూడా కాస్తా ఎమోషనల్కు లోనైయ్యారు.ఇక దీప్తి సునైనాను బయటికి పంపించడంలో సక్సెస్ అయ్యారు కౌశల్ ఆర్మీ.ఇప్పటికి వరకు జరిగిన ఎలిమినేషన్స్ ఒకసారి పరిశీలిస్తే ఎలిమినేట్ అయిన వారంతా కౌశల్తో గొడవ పెట్టుకోవడం వల్లే బయటికి వచ్చేశారని ఇట్టే అర్థం అవుతుంది.తాజాగా హౌస్ జరిగిన కాల్ సెంటర్ టాస్క్లో దీప్తి కౌశల్ను తిట్టడంతో ఆమెపై వ్యతిరేకత బాగా ఎక్కువైంది.ఇక బయట కౌశల్ ఆర్మీ దీప్తికి వ్యతిరేకంగా ఓట్లు వేసి ఆమెను బయటికి వెళ్లేలా చేశారని చాలామంది నమ్ముతున్నారు. మరి రాబోవు రోజుల్లో కౌశల్తో ఎవరు గొడవ పెట్టుకుంటారో చూడాలి.