Friday, April 26, 2024
- Advertisement -

రాజమౌళి ట్వీట్​.. దెబ్బకు దిగొచ్చిన ఢిల్లీ ఎయిర్​పోర్టు.. !

- Advertisement -

ఢిల్లీ ఎయిర్​పోర్టులో సరైన సౌకర్యాలు లేవంటూ నిన్న రాజమౌళి ఓ ట్వీట్​ పెట్టిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్​తో పెను దుమారం రేగింది. ఢిల్లీ ఎయిర్​పోర్టులో సరైన సౌకర్యాలు లేవని.. ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చేయించుకొనేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. అంతేకాక విమానశ్రయం బయట వీధిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని.. పరిస్థితి ఇలా ఉంటే విదేశీయులు వచ్చినప్పుడు మనదేశం పరువు ఏమవుతుందని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సాధారణంగా సమస్యలపై పెద్దగా స్పందించని రాజమౌళి తొలిసారిగా ఇలా ట్వీట్​ పెట్టడం గమనార్హం. అయితే రాజమౌళి ట్వీట్​ పై ఢిల్లీ ఎయిర్​ పోర్టు స్పందించింది. ఈ మేరకు ఓ ట్వీట్​ చేసింది. ’ రాజమౌళి సార్​.. మీరు ఫీడ్​బ్యాక్​ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చేయించుకొనేందుకు ప్రయాణికుల కోసం డెస్కుల ఉన్నాయి. అయితే అక్కడ వాటి సంఖ్యను మరింత పెంచుతాం. ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తాం. మీరు మా దృష్టికి తీసుకొచ్చిన ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తాం’ అంటూ ఢిల్లీ ఎయిర్​పోర్ట్​ స్పందించింది.

Also Read: ‘మా’ పెట్టిన చిచ్చు.. చిరు వర్సెస్​ మోహన్​బాబు

మొత్తానికి రాజమౌళి ట్వీట్​ బాగానే ఎఫెక్ట్​ చూపించింది.ఇక రాజమౌళి ప్రస్తుతం ఆర్​ఆర్​ఆర్​ అనే చారిత్రక చిత్రాన్ని భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు. దీని తరువాత మహేష్ బాబు తో ఓ సినిమా చేస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్ తో మగధీర -2ను ప్లాన్​ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Also Read: ‘ఐకాన్’ తో సుకుమార్ కు భలే చిక్కొచ్చి పడిందే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -