కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు కేవలం కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్, బాలివుడ్ లో కూడా మంచి పేరు ఉంది. ఈ హీరో తీసిన చాలా సినిమాలు పలు భాషల్లో విడుదలై మంచి వసుళ్లను రాబడుతున్నాయి. అయితే ఇప్పడు ఈ యువ హీరో నటిస్తోన్న చిత్రం ‘జగమే తంత్రం’. ఈ సినిమా తమిళంలో ‘జగమే తంతిరమ్’ పేరుతో రూపొందుతుంది.
ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా చేస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్పై శశికాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ధనుష్ కు 40వది. ఇప్పకే రిలీజ్ అయిన ప్రోమోస్ పలువురిని ఆకట్టుకుంటున్నాయి.ఇప్పుడు ‘జగమే తంత్రం’ తమిళ్ టీజర్ రిలీజ్ కూడా యూట్యూబ్ లో దర్శణమిస్తోంది.
ఇందులో ధనుష్ రెండు డిఫరెంట్ గెటప్స్లో చేస్తున్నట్టు కనిపిస్తోంది.అయితే ఈ ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్టుగా ఓటీటీలో విడుదలకానుంది. నెట్ఫ్లిక్స్లో ఇది స్ట్రీమింగ్ కానుందని చిత్ర యూనిట్ తేల్చి చెప్పేసింది. ఇప్పటివరకైతే తెలుగు పోస్టర్స్, సాంగ్ రిలీజ్ చేశారు. సినిమా తెలుగులో కూడా విడుదల అవుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
15యేళ్ల తర్వాత మెగాస్టార్ కు జోడిగా ఆ ముద్దుగుమ్మ!
మిస్సెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలుగు యువతి !
ఎన్టీఆర్ తో తలబడుతున్న విజయ్ సేతుపతి !