అహ్మదాబాద్ లో మిస్సెస్ ఇండియా సీజన్-2 పోటీలు జరిగాయి. ఇందులో తెలంగాణలోని ఖమ్మం ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫర్హా రన్నరప్ గా నిలిచి తన సత్తాను చాటింది. దేశవ్యాప్తంగా ఈ మిస్సెస్ ఇండియా పోటీల్లో పాల్గొంటారు ఈ సారి దేశం మొత్తం నుంచి 912 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులోని వారిని పలు పద్దతుల ద్వారా సెలక్ట్ చేస్తారు.
ఆ ప్రాసెస్ ద్వారా 41 మందిని ఫైనల్ పోటీలకు ఎంపిక చేశారు. ఆ లిస్ట్ లో తెలంగాణ నుంచి ఫర్హా మాత్రమే చోటు సంపాదించింది. ఇక ఫోటో జెనిక్ విభాగంలో ఫర్హా విజేతగా నిలిచారు.ఆ తర్వాత మిస్సెస్ ఇండియా పోటీలో టాప్-5లో చోటు సంపాదించింది. దీంతో ఆమె రన్నరప్ గా నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు తెలుగువారు ఆమెను ప్రసంశలతో ముంచెత్తుతున్నారు.
ఈ మహ్మద్ ఫర్హా ఎంబీయే ను కంప్లీట్ చేసింది. ఆవిడ ప్రస్తుతం మానవ హక్కులు, సోషల్ జస్టిస్ మిషన్, మహిళా సాధికారత సంస్థలకు ఖమ్మం జిల్లా కార్యదర్శిగా వర్క్ చేస్తోంది. ఈ విజయం సాధించన తర్వాతా ఆమె మీడియాతో మాట్లాడింది. మహిళల హక్కుల పరిరక్షణకు పోరాడతానని పేర్కొంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతోనే ఈ విజయం సాధించినట్లు పేర్కొంది.
ట్రాన్స్ జెండర్ గా విజయ్ సేతుపతి !