Friday, April 26, 2024
- Advertisement -

మాస్ కా బాస్ ని ఎలా చూపించాలో అలా.. స్క్రిప్ట్ సిద్ధం చేసిన బాబీ..!

- Advertisement -

చిరంజీవి అంటే మాస్.. మాస్ అంటే చిరంజీవి. అసలు కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ చిరు. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆయన ప్రతి సినిమాలో ఉంటాయి. అయితే ఇంద్ర మూవీ తర్వాత సామాజిక సందేశం తో కూడిన సినిమాలు చేసేందుకే చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారు. ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీయస్, స్టాలిన్, ఖైదీ నంబర్ 150 ఇలా ప్రతి సినిమాలోనూ అంతర్లీనంగా ఏదో ఒక సందేశం ఉంటూ వస్తోంది. ఇక తాజాగా చిరంజీవి నటించిన సైరా మూవీ చారిత్రక కథతో రూపొండింది.

ఖైదీ, సైరా సినిమాలు హిట్ అయినా చిరంజీవి ఫ్యాన్స్ దాహం తీరలేదు. చిరంజీవిని మళ్లీ ఓ మాంచి మాస్ మూవీలో చూడాలని అభిమానుల ఆశ. అయితే అభిమానుల ఆశలను డైరెక్టర్ బాబీ తీర్చేలా కనిపిస్తున్నాడు. స్వతహాగా చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ అభిమానులు మెచ్చేలా ఓ మాంచి మాస్ కథ సిద్ధం చేశారట. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది.

ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయినట్లు బాబీ చెప్పారు. ఇటీవల బాబీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో కలసి చిరంజీవిని కలిశారట. తన సినిమాకు సంబంధించి కొన్ని ట్యూన్స్ వినిపించారట. ఈ సినిమా మ్యూజిక్ కంపోజ్ ఇప్పటికే దేవిశ్రీ ఇప్పటికే ప్రారంభించారు. అయితే ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. సినిమా కంప్లీట్ అయిన తర్వాత లూసిఫర్ రీమేక్ పట్టాలెక్కనుంది. అయితే లూసిఫర్ తో సమాంతరంగా తన సినిమా ప్రారంభం అవుతుందా.. లేదంటే లూసిఫర్ పూర్తయిన తర్వాత మొదలవుతుందా.. అనే విషయమై ఇంకా క్లారిటీ లేదని బాబీ తెలిపారు.

Also Read

సోనూ సూద్​ .. చెర్రీ మధ్య భీకర ఫైట్..!

సోషల్ మీడియా సినీ ఇండస్ట్రీకి ప్లస్సా.. మైనస్సా..!

అల్లు వారబ్బాయి మెడకు ఏమైయింది..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -