తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ కాంబో అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది బోయపాటి శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’,‘లెజెండ్’ బాక్సాఫీస్ షేక్ చేశాయి. ఇక లెజెండ్ చిత్రం అయితే ఎన్నో రికార్డులు కూడా క్రియేట్ చేసింది. తాజాగా తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
ఉదయం వీఐపీ దర్శన సమయంలో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా బోయపాటి మాట్లాడుతూ.. నందమూరి బాలకృష్ణతో తెరకెక్కిస్తున్న ‘అఖండ’ క్లైమాక్స్ షూటింగ్ లొకేషన్ల కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో వర్షాలు పడుతున్న కారణంగా కడపలో లొకేషన్స్ వెతుకుతున్నట్లు వెల్లడించారు. కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి గమనించి ‘అఖండ’ సినిమా విడుదల తేదీని నిర్ణయిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ సినిమా అభిమానుల అంచనాలు మించిపోతాయని.. బాలయ్య విశ్వరూపం మరోసారి చూపించబోతున్నారని అన్నారు.
బోరున విలపిస్తూ.. క్రీడా మైదానం నుంచి బయటకు వెళ్లిన సెరీనా విలియమ్స్!