- Advertisement -
గోవా బ్యూటీ చాలా రోజుల తరువాత ,ఇంకా చెప్పాలంటే చాలా సంవత్సరాల తరువాత తెలుగు సినిమా చేస్తుంది.రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా రూపొందుతోంది.ఈ సినిమాలో ఓ హీరోయిన్గా ఇలియానాను తీసుకున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగులో ఇలియానా జాయిన్ అయింది.
రవితేజ, ఇలియానా కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు..శ్రీను వైట్ల పిల్లలు కూడా ఈ సినిమా షూటింగ్ కోసం అమెరికాకి వచ్చారు. పిల్లలతో హీరోయిన్ ఇలియానాతో బాగా కలిసిపోయారని ,వాళ్లు ఇలియానాకి స్పెషల్ గా వాళ్లు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రవితేజ ఇలియానా కలిసి ఇప్పటికే మూడు సినిమాలలో నటించారు.