Saturday, April 27, 2024
- Advertisement -

త‌మిళంలో భారీ మ‌ల్టీస్టార‌ర్‌.. హీరోలు ఎవ‌రెవ‌రో తెలుసా

- Advertisement -

మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు ఇప్పుడు మ‌రో క్రేజీ అంశంగా సినీ ప‌రిశ్ర‌మ‌లో వ‌స్తోంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు వ‌స్తుండ‌డం.. ప్రేక్షకాభిమానులు కూడా ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో ఈ జోన‌ర్ సినిమాల‌పై ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. అందుక‌నుగుణంగా సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. తెలుగులో అలాంటి ఇప్పుడు దాదాపు మూడు, నాలుగు చ‌ర్చ‌లో ద‌శ‌లో ఉన్నాయి. అయితే త‌మిళంలో మాత్రం ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ మాత్రం సెట్స్‌పైకి వెళ్లి అంద‌ర్నీ ఆశ్చ‌ర్యంలో ముంతెత్తింది. ఆ సినిమాను తెలుగులో కూడా విడుద‌ల చేస్తుండ‌డంతో తెలుగు ప్రేక్ష‌కులు కూడా ఆస‌క్తిగా ఆ సినిమా వివ‌రాలు గ‌మ‌నిస్తున్నారు.

క్లాసిక్ సినిమాలు రూపొందించే దర్శకుడు మణిరత్నం ఓ భారీ మల్టీస్టారర్‌ను తీస్తున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను ఇటీవ‌ల విడుద‌ల చేశారు. దాంతో పాటు సినిమా టైటిల్‌, లోగోతో పాటు ఎవ‌రెవ‌రు న‌టిస్తున్నారో ప్ర‌క‌టించారు.

తమిళ్‌లో ‘చెక్క చివంత వానమ్‌’గా రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగులో ‘నవాబ్‌’గా వ‌స్తోంది. ఈ సినిమాలో శింబు, విజయ్‌ సేతుపతి, అరవింద్‌ స్వామితో పాటు అరుణ్‌ విజయ్ (బ్రూస్‌ లీ ఫేం) న‌టిస్తున్నారు. ఈ సినిమాలో వారి ప‌క్క‌న న‌టించ‌డానికి జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్‌, అదితి రావ్‌ హైదరి, డయానా హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ప్రకాశ్‌రాజ్‌, త్యాగరాజన్‌, మన్‌సూర్‌ అలీఖాన్‌, జయసుధ తదితరులు కీలకపాత్రల్లో ఉండ‌నున్నార‌ని స‌మాచారం.

ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ను మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ హౌస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఏఆర్‌ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 12వ‌ నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుంది. షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబ‌ర్ నాటికి విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -