మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. పూరీ మ్యూజింగ్స్ పేరుతో ప్రతిరోజు అభిమానులతో పలు విషయాలను పంచుకుంటూ ఉంటారు. పోడ్కాస్ట్ రూపంలో ఆయన యూట్యూబ్లో వీడియోలు పోస్టు చేస్తుంటారు. జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఇక్కడ చెబుతుంటారు పూరి.. మాస్, క్లాస్ ఆడియన్స్ను ఆకట్టుకొనే డైలాగ్స్ రాయడంలో పూరి సిద్ధ హస్తుడు. ఇక పూరీ మ్యూజింగ్స్లోనూ ఆయన చెప్పే మాటలు యువతను కట్టిపడేస్తుంటాయి. జీవితంలో మనం ముఖ్యం అనుకొనే విషయాల వెనక ఎంత సిల్లీ రీజన్స్ ఉంటాయో బయట పెడతాడు పూరి.
అంతేకాక ప్రేమ, పెళ్లి, జాతకాలు, సేవలు ఇలా పలు విషయాలపై ఎంతో లోతుగా సాగుతుంటాయి పూరి విశ్లేషణలు. పూరీ గురువు రామ్గోపాల్ వర్మ కూడా రామూఇజం పేరుతో అనేక విషయాలు చర్చిస్తాడన్న విషయం తెలిసిందే. పూరి కూడా వివిధ విషయాలపై తనదైన స్టయిల్లో ఘాటుగా స్పందిస్తుంటారు.తాజాగా ఆయన పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.
మన జీవితం కేవలం మూడురోజుల డ్రామా.. అటువంటి క్షణికమైన ఈ జీవితాన్ని పెళ్లి చేసుకొని నరకప్రాయం చేసుకోవడం ఎందుకు? అని ప్రశ్నించాడు పూరి. అంతేకాక.. చాలా మంది మాకు 60 ఏళ్లు వచ్చాయని ఇక రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు.మనకు ఎంత వయసొచ్చినా నేర్చుకొనేది చాలా ఉంటుంది. నిజానికి క్లైమాక్స్ బాగుంటేనే కదా సినిమా హిట్ అయ్యేది. అలాగే జీవితం కూడా.. నేను చెప్పేది ఏమీ తత్వ శాస్త్రం కాదు. కేవలం ఇంగిత జ్ఞానం మాత్రమే’ ఇలా సాగింది ఇవాల్టి పూరి మ్యూజింగ్స్.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. లైగర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ.. అనన్య హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read