Friday, March 29, 2024
- Advertisement -

పెళ్లంటే నరకం..! అంటున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్..!

- Advertisement -

మాస్​ డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​.. పూరీ మ్యూజింగ్స్ పేరుతో ప్రతిరోజు అభిమానులతో పలు విషయాలను పంచుకుంటూ ఉంటారు. పోడ్​కాస్ట్​ రూపంలో ఆయన యూట్యూబ్​లో వీడియోలు పోస్టు చేస్తుంటారు. జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఇక్కడ చెబుతుంటారు పూరి.. మాస్​, క్లాస్ ఆడియన్స్​ను ఆకట్టుకొనే డైలాగ్స్​ రాయడంలో పూరి సిద్ధ హస్తుడు. ఇక పూరీ మ్యూజింగ్స్​లోనూ ఆయన చెప్పే మాటలు యువతను కట్టిపడేస్తుంటాయి. జీవితంలో మనం ముఖ్యం అనుకొనే విషయాల వెనక ఎంత సిల్లీ రీజన్స్​ ఉంటాయో బయట పెడతాడు పూరి.

అంతేకాక ప్రేమ, పెళ్లి, జాతకాలు, సేవలు ఇలా పలు విషయాలపై ఎంతో లోతుగా సాగుతుంటాయి పూరి విశ్లేషణలు. పూరీ గురువు రామ్​గోపాల్​ వర్మ కూడా రామూఇజం పేరుతో అనేక విషయాలు చర్చిస్తాడన్న విషయం తెలిసిందే. పూరి కూడా వివిధ విషయాలపై తనదైన స్టయిల్​లో ఘాటుగా స్పందిస్తుంటారు.తాజాగా ఆయన పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

మన జీవితం కేవలం మూడురోజుల డ్రామా.. అటువంటి క్షణికమైన ఈ జీవితాన్ని పెళ్లి చేసుకొని నరకప్రాయం చేసుకోవడం ఎందుకు? అని ప్రశ్నించాడు పూరి. అంతేకాక.. చాలా మంది మాకు 60 ఏళ్లు వచ్చాయని ఇక రెస్ట్​ తీసుకుంటూ ఉంటారు. ఇది చాలా తప్పు.మనకు ఎంత వయసొచ్చినా నేర్చుకొనేది చాలా ఉంటుంది. నిజానికి క్లైమాక్స్​ బాగుంటేనే కదా సినిమా హిట్​ అయ్యేది. అలాగే జీవితం కూడా.. నేను చెప్పేది ఏమీ తత్వ శాస్త్రం కాదు. కేవలం ఇంగిత జ్ఞానం మాత్రమే’ ఇలా సాగింది ఇవాల్టి పూరి మ్యూజింగ్స్​.

ప్రస్తుతం పూరీ జగన్నాథ్.. లైగర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్​ దేవరకొండ.. అనన్య హీరోహీరోయిన్లుగా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, పూరీ జగన్నాథ్, ఛార్మీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read

ఫ్యామిలీ మ్యాన్​ -3లో క్రేజీ సౌత్​ హీరో..!

టాలీవుడ్​ ప్రొడ్యూసర్​తో యశ్​ మూవీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -