తెలుగు ఇండస్ట్రీలో 20 ఏళ్ల కింద శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనందం’ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆనందం మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరో ఆకాష్ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. లవ్ ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటటైనర్ గా వచ్చిన ఈ మూవీ కాలేజీ కుర్రకారును విపరీతంగా ఆకర్షించి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
‘ఆనందం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న హీరో ఆకాష్ తర్వాత తెలుగులో ఆనందమానందమాయే, పిలిస్తే పలుకుతా, నమో వెంకటేశ, అందాల రాముడు, నవ వసంతం, గోరింటాకు వంటి సినిమాల్లో హీరో గాను, కొన్నిట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. సినీ అవకాశాలు తగ్గడంతో సీరియల్ యాక్టర్గా మారీ కన్నడలో ‘జోతాయి జోతాయల్లీ’ సీరియల్ తో అక్కడి ప్రేక్షకుల్ని అలరించడంతో ఇదే సీరియల్ని తమిళంలో కూడా ‘నీతానై ఎంతన్ పొన్వసంతన్’ పేరుతో ప్రసారం అవుతుంది. అదే సీరియల్ ను తెలుగులో ‘ప్రేమ ఎంత మధురం’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
Also read:తమిళనాట విశ్వనటుడు అందుకే ఓడిపోయారా?
తెలుగులో ఇంత ఆదరణ పొందిన హీరో ఆకాష్ శ్రీలంక నుంచి వచ్చి తెలుగులో సినిమాలు చేసి ప్రేక్షకాభిమానాన్ని పొందారు. ఈ విషయం చాలా మందికి తెలియదు.ఆకాష్ తమిళనాడు నుంచి వచ్చాడని చాలా మంది అనుకుంటారు. కానీ ఆకాష్ పుట్టిపెరిగింది శ్రీలంకలో. తర్వాత లండన్ కి వెళ్ళి సినీరంగం మీద ఉన్న ఆసక్తితో అక్కడి నుంచి ఇండస్ట్రీలోకి వచ్చాడు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించి హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.
Also read:కరోనా సమయంలో పెళ్లి వేడుకలు… ఎమోషనల్ అయినా యాంకర్ ఝాన్సీ!