హీరో నాగశౌర్య చాలాకాలం తరువాత ఛలో సినిమాతో హిట్ కొట్టాడు.ఛలో సినిమా తరువాత కణం సినిమా చేసినప్పటికి ఈ సినిమాపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు.దీనికి కారణం ఇది తమిళ్ సినిమా కావడం, హీరోయిన్ సాయిపల్లవితో గొడవ మరో కారణంగా తెలుస్తుంది.శౌర్య తాజా చిత్రం అమ్మమ్మగారి ఇల్లుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈరోజు(సోమవారం) సినిమా టీజర్ రీలిజ్ చేశారు చిత్ర యూనిట్.ఆ కార్యక్రమంలో శౌర్య క్రిటిక్స్, రివ్యూలు రాసేవారికి విజ్ఞప్తి చేశాడు.
‘అమ్మమ్మ గారి ఇల్లు’ సినిమా రిలీజ్ అయ్యాక దయచేసి రేటింగ్ పెట్టకండి. ఎందుకంటే అమ్మమ్మ బంధం నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ నచ్చాలని మేం తీయలేదు. ఈ సినిమా ఒక్కరికి కనెక్ట్ అయినా.. వారి అనుభూతులు మీరు తెలుసుకోండి. అంతేగానీ దయచేసి రేటింగ్ మాత్రం ఇవ్వకండి.ఏది అయిన తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని ముగించాడు.