Tuesday, May 21, 2024
- Advertisement -

మహేశ్ ఫ్యాన్స్ కు కిక్ ఇస్తున్న ‘శ్రీమంతుడు’ కబుర్లు!

- Advertisement -

ప్రిన్స్ మహేశ్ బాబు సినిమా శ్రీమంతుడు ఆయన అభిమానులకు కిక్ నిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తమ అభిమాన హీరో సినిమా విడుదల కు సంబంధించిన విషయాలు తెలవడం ఒక విధంగా ఆనందం అయితే.. ఈ సినిమా బిజినెస్ కు సంబంధించిన వార్తలు మరింత ఆసక్తికరం.

‘శ్రీమంతుడు’ సినిమాకు సంబంధించి నైజాం ఏరియా హక్కులు ఏకంగా 14.4 కోట్లు రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తుంది. అభిషేక్ పిక్చర్స్ అనే సంస్థ ఈ మేరకు డబ్బు వెచ్చిస్తూ సినిమాను కొనుక్కొన్నట్టుగా తెలుస్తోంది. మరి ఒక ఏరియా హక్కులు ఇంత మొత్తానికి అమ్ముడు పోవడం నిర్మాతలకు చాలా ఊరటనిచ్చే అంశం. ఇది హీరో అభిమానులకు కూడా ఆనందాన్ని ఇచ్చే అంశం. 

ఇదిలా ఉంటే శ్రీమంతుడు సినిమా ఆడియో విడుదల, సినిమా విడుదలలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది. జూలై 17 న ఈ సినిమా ఆడియో విడుదల కానుంది. ఆగస్టు ఏడున సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. అంత వరకూ అభిమానులు ‘శ్రీమంతుడు’ కోసం ఉద్వేగంగా ఎదురుచూడాల్సిందే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -