తన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సింగర్ గీతా మాధురి.తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ రెండో సీజన్లో రన్నరప్గా నిలిచిన గీతామాధురి కొన్ని యూట్యూబ్ చానెళ్లపై ఆగ్రహంగా ఉన్నారు. తనపై కొన్ని యూట్యూబ్ చానెళ్లు తప్పుడు వార్తలు ప్రజెంట్ చేస్తున్న వారికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది గీతా మాధురి.తనపై ఫేక్ వీడియోలు,ఫేక్ వార్తలు రాస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని తెలిసింది గీతా.చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ముందు ఆ వీడియోలను తీసివేయడానికి, సదరు యూట్యూబ్ ఛానెళ్లకి కొంత సమయం ఇస్తున్నానని పేర్కొన్నారు.
‘మహా అయితే ఓ రోజు బాధపడతానేమో తర్వాత సంతోషం, ప్రశాంతత నాదే’ అంటూ పోస్ట్ పెట్టారు.బిగ్బాస్ విన్నర్ కౌశల్పై గీతా మాధురి కామెంట్స్ చేసిందని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఫేక్ వార్తలు,వీడియోలు పెట్టడంతో వారిపై ఇదిగో ఇలా ఫైర్ అయింది గీతా .బిగ్బాస్ నుంచి బయటికి వచ్చిన తరువాత గీతా మాధురికి సినిమాలలో ఛాన్సులు కూడా వస్తున్నాయని సమాచారం.