Thursday, April 25, 2024
- Advertisement -

‘ఆరడుగుల బుల్లెట్’ ఇప్పుడు విడుదలైతే.. పేలుతుందా?

- Advertisement -

మాస్ హీరో గోపీచంద్ హీరోగా, నయనతార హీరోయిన్ గా బి. గోపాల్ దర్శకత్వంలో ఐదేళ్ల కిందట ఆరడుగుల బుల్లెట్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు వక్కంతం వంశీ కథను అందించారు. అబ్బూరి రవి మాటలు రాశారు. మణిశర్మ మ్యూజిక్​ అందించారు. తాండ్ర రమేశ్​​ నిర్మించిన ఈ సినిమా ఆర్థిక ఇబ్బందులతో విడుదల ఆగిపోయింది. ఈ సినిమా మీద అప్పట్లో భారీ అంచనాలు ఉన్నాయి. గోపీచంద్ కు మాస్ హీరోగా గుర్తింపు ఉంది. ఇక బి. గోపాల్​ అంటే చాలు మాస్ సినిమాలు, ఫ్యాక్షన్ సినిమాలు గుర్తుకొస్తాయి.గోపీచంద్, బి. గోపాల్ కలయికతో ఒక మంచి మాస్ ఎంటర్ టైనర్ రావడం పక్కా అని అభిమానులు ఆశించారు. అప్పట్లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా పలు సార్లు విడుదల వాయిదా పడింది. ఓ దశలో ఓటీటీలో ఈ మూవీ విడుదల చేస్తారన్న టాక్​ కూడా నడించింది. కానీ అలా జరగలేదు. అసలు ఈ సినిమా విడుదలవుతుందా? లేక పెండింగ్ చిత్రాల జాబితాలోకి వెళ్లిపోతుందా? అన్న సందేహం కూడా వ్యక్తమయింది. ఈ క్రమంలో త్వరలో మూవీని సొంతంగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాత తాండ్ర రమేశ్​ ప్రకటించారు. ఈ సినిమాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయని ఆయన చెప్పారు.

అయితే ఎప్పుడో అయిదేళ్ల క్రితం రాసుకున్న కథ ఇప్పుడు ఆడుతుందా? లేదా ? అన్నది సందేహంగా మారింది. ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ ప్రకటించి, ఆ తర్వాత ఆగిపోవడంతో ఈ సినిమా పట్ల ఎవరికీ పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. కనీసం సినిమా విడుదల అయితే పెట్టిన పెట్టుబడి అయినా దక్కించుకుందామన్న ఉద్దేశ్యంతో నిర్మాత రిలీజ్​ చేసేందుకు సిద్ధపడ్డారని సమాచారం. మరి ఐదేళ్ల తర్వాత విడుదలవుతున్న ఆరడుగుల బుల్లెట్టు పేలుతుందో లేదో చూడాలి.

Also Read

విశాల్ ఫిర్యాదుపై ఆర్.బి.చౌదరి ఆవేదన ..!

మరోసారి మెగాస్టార్ తో వినాయక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -