- Advertisement -
విలన్గా సినీ ప్రవేశం చేసి ఇప్పుడు హీరోగా నటిస్తున్న నటుడు గోపీచంద్. అతడి 25వ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. విడుదలకు సిద్ధంగా ఉంది. మే 18వ తేదీన కొత్త దర్శకుడు చక్రి ‘పంతం’ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో గోపిచంద్, మెహరీన్ నటిస్తుండగా, కె.కె. రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
‘పంతం’ మొదటి షూటింగ్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. గోపీసుందర్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మెహరీన్ ఉపాధ్యాయురాలిగా కనిపించనుందని సమాచారం. గోపిచంద్ విజయం కోసం తహతహలాడుతున్నాడు. ఈ సినిమాపై గోపిచంద్ అంచనాలు భారీగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఫ్లాపులతో గోపిచంద్ కొనసాగుతున్నాడు. మరీ ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.