బుల్లితెరపై యాంకర్ సుమకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే రీసెంట్ గా యాంకర్ సుమకి.. డీజే ఆడియో వేడుకలో పెద్దా షాక్ తగిలింది. అది కుడా ఆ సినిమా డైరెక్టర్ హరిష్ శంకర్, నిర్మాత దిల్ రాజు.
{loadmodule mod_custom,GA1}
యాంకర్ సుమకి తెలుగు ఇండస్ట్రీ లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆమె వేసే ఫన్నీ సెటైర్స్ స్టేజీపై వున్న వారినే కాదు… ఎక్కడో దూరంగా టీవీల ముందు కూర్చుని లైవ్ చూస్తున్న వారిని సైతం కితకితలు పెడతాయి.. కడుపుబ్బా నవ్విస్తాయి.ఎప్పుడు ప్రేక్షకుల ఆనందాన్ని దృష్టిలో పెట్టుకొని సుమ యాంకరింగ్ చేస్తుంటుంది.అయితే ఈ మద్య యాంకర్లు స్టేజ్ పై ఏవి పడితే అది మాట్లాడుతున్నారు..చాలా కాంట్రవర్సీస్ సృష్టిస్తున్నారు.అయితే ఈ విషయంపై సుమకు షాక్ ఇచ్చారనుకుంటే..పొరపాటే. ఇప్పటికే యాంకర్ సుమ ఎన్నో ఆడియో వేడుకల్లో యాంకర్ గా చేసింది. కానీ ఎవరూ కూడా ఆమెను పోగడలేదు. ఇక దువ్వాడ జగన్నాథం లో ‘మెచ్చుకో’ అనే సాంగ్ ని వేదికపై కూర్చున్న దిల్ రాజు, హరీష్ శంకర్ లను లాంచ్ చేయాల్సిందిగా సుమ కోరింది. అంతే వారిచ్చిన షాక్ కి సుమ కాసేపు ఆశ్చర్యంలో మునిగిపోయింది.దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ..ఇప్పటి వరకు సుమ ఎన్నో ఆడియో ఫంక్షన్లు నిర్వహించింది కానీ ఎప్పుడు ఆమెను ఎవ్వరూ పొగడలేదు..కానీ ఈ సారి మాత్రం సుమ గొప్ప చాన్స్ ఇస్తున్నామని ‘మెచ్చుకో’ సాంగ్ సుమ లాంచ్ చేయాల్సింది గా కోరారు.
{loadmodule mod_custom,GA2}
దీంతో యంకర్ సుమ ఒక్కసారిగా షాక్ కి గురైంది..ఈ అనుకోని పరిణామానికి ఖంగుతిన్న సుమ.. ఎన్నో ఆడియో ఫంక్షన్లకి యాంకరింగ్ చేసిన తాను ఎప్పుడూ ఇలా సినిమా పాటలు లాంచ్ చేయలేదని.. మొదటిసారిగా తన చేతుల మీదుగా ఓ సినిమా పాట లాంచ్ అవుతోందని అన్నారు. ఈ సాంగ్ లాంచింగ్ ద్వారా ‘దువ్వాడ జగన్నాథమ్’ చరిత్ర పుటల్లో తనకీ ఓ పేజీ వుంటుందంటూ అలవాటు ప్రకారమే సుమ తనదైన స్టైల్లో డైలాగ్ కొట్టడంతో ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన అందరూ ఒక్కసారే నవ్వుకున్నారు.
{youtube}-4tjtfPMAcE{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related