సీనియర్ ఎన్టీఆర్ జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఎన్టీఆర్ రోల్ను ఆయన తనయుడు హీరో బాలకృష్ణ పోషిస్తున్నారు. ఆయనే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.సినిమా షూటింగ్ మొదలు అవుతుందనే దశలో దర్శకుడు తేజ సినిమా నుండి సడన్గా తప్పుకున్నారు. బాలకృష్ణకు తేజకు మధ్య సినిమా విషయంలో అభిప్రాయభేదాలు రావడంతో తేజ సినిమా నుండి తప్పుకున్నారని సమాచారం.
తేజ తప్పుకున్న సినిమాను వేరే దర్శకుడితో కాని లేదా తానో దర్శకత్వ భాద్యతలను తీసుకొవలని బాలకృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే సినిమాలోని నటీనటుల ఎంపిక పూర్తి అయినట్లుంది.మరో కీలక పాత్ర కోసం హేమా మాలినిని ఫైనల్ చేశాడట బాలయ్య.ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఇందిరాగాంధీ అంశం కోసం ఆమె పాత్రలో హేమా మాలినిని సంప్రదిస్తే ఆమె ఓకే చేసినట్లు తెలుస్తుంది.కొన్ని నిమిషాలు మాత్రమే ఉండే ఆమె పాత్ర సినిమాని మలుపు తిప్పే విధంగా ఉంటుందని టాక్ వస్తోంది.