యజ్ఞం సినిమాతో కేరీర్ మొదలు పెట్టిన దర్శకుడు ఎ.యస్.రవికుమార్ చౌదరి.. ఆ తర్వాత బాలయ్యతో తీసిన వీరభద్ర అనే సినిమా చేసినప్పటికి ఆ సినిమా అనుకున్న రెంజ్ లో హిట్ కాలేకపోయింది. ఆ తర్వాత పిల్లానువ్వులేని జీవితం సినిమా తీసాడు. ఈ సినిమా మంచి విజయం దక్కడంతో రవికుమార్ చౌదరి స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయారు.
అయితే ఇప్పుడు ఈ దర్శకుడు తన సొంత బ్యానర్ అయినట్టువంటి రుగ్వేద క్రియేషన్స్ బ్యానర్పై యువ హీరో ఆది పినిశెట్టి హీరోగా ఓ సినిమాని రూపొందిస్తున్నారు. ఆ సినిమా మేడే నాడు ప్రారంభం కాబోతున్నట్లు ఆద్యా న్యూస్ కి అందుతున్న సమాచారం. సినిమా మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించనున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన నటీనటులు, టెక్నిషియన్స్ ఎంపిక జరుగుతోంది. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో క్రేజ్ ఉన్న యాంగ్రీ హీరో విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Related