Sunday, May 5, 2024
- Advertisement -

సినిమాల మీద సినిమాలు

- Advertisement -
  • శ‌ర్వానంద్ మూడో సినిమా ప్రారంభం
  • జ‌త క‌ట్టునున్న‌కాజ‌ల్‌, నిత్య‌

ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు సినిమాల‌తో మంచి విజయం సాధించిన యువ న‌టుడు శ‌ర్వానంద్ సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నాడు. త‌న చేతిలో ఇంకా రెండు సినిమాలు ఉండ‌గానే మూడో సినిమా కూడా ప్రారంభించేశాడు. ఈ సక్సెస్‌ను కంటిన్యూ చేస్తూ గతవారం హను రాఘ‌వపుడి దర్శకత్వంలో ఓ సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా తర్వాత మ‌రో సినిమాకు ఒప్పుకున్నాడు. ఈ సినిమా ప్రారంభోత్స‌వం సోమ‌వారం జ‌రిగింది. చిన్న సినిమా వ‌చ్చి విజ‌యం సాధించిన స్వామి రారా దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. హైద‌రాబాద్‌లోని రామానాయుడు స్ట‌డియోలో ఈ సినిమా పూజాకార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది.

సినిమా ప్రారంభోత్స‌వానికి హాజ‌రైన అక్కినేని నాగ‌చైత‌న్య మొద‌టి క్లాప్ శ‌ర్వానంద్‌పై తీశాడు. దిల్ రాజ్ కూడా హాజ‌ర‌య్యాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే శ‌ర్వానంద్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

శర్వానంద్, నిత్యామీనన్ క‌లిసి గతంలో మళ్లీమళ్లీ ఇది రానిరోజు, రాజాధిరాజ సినిమాల్లో కలిసి నటించారు. మూడోసారి వీరిద్దరూ కలిసి సుదీర్ వర్మ సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా తరువాత శర్వానంద్ దిల్ రాజు సంస్థలో మరో సినిమా చెయ్యబోతున్నాడని టాక్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -