- Advertisement -
చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ సాధించిన సినిమా ఆర్ఎక్స్ 100.ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.అయితే ఈ కథను ముందుగా దర్శకుడు అజయ్ భూపతి ముందుగా సుధీర్ బాబు దగ్గరికే వచ్చాడట.ఈ కథపై సుధీర్ బాబు పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో, కథ కార్తికేయ దగ్గరికి వచ్చిందని సమాచారం.సుధీర్ బాబు ఈ సినిమాను చేసి వుంటే ‘సమ్మోహనం’ వెంటనే మరో హిట్ పడి ఉండేది.
ఏది ఏమైనా సుధీరబాబు మంచి హిట్ను కోల్పొయ్యాడు అని అందరు భావిస్తున్నారు.కార్తికేయ,పాయల్ రాజ్ పుత్ హీరో,హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.రెండున్నర కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి వీకెండ్లోనే లాభాల బాట పట్టింది.సినిమా శాటిలైట్ రైట్స్ కోసం పలు టీవీ చానెల్స్ పోటీ పుడుతున్నాయి.