- Advertisement -
యంగ్ హీరో సుధీర్ బాబు దూసుకుపోతున్నాడు.సమ్మోహనం హిట్తో మంచి జోష్లో ఉన్నాడు సుధీర్ బాబు.ప్రస్తుతం ఆయన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాను సుధీర్ బాబే తన నిర్మాణ సంస్థలో స్వంతంగా నిర్మిస్తున్నాడు.ఈ సినిమాతో ఆర్ఎస్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుధీర్ బాబు సొంత నిర్మాణ సంస్థ సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ని స్థాపించారు.
ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్.తాజాగా ఈ సినిమా స్టీలర్ పేరుతో రిలీజ్ చేశారు. సుధీర్ బాబు టిపికల్ మెంటాలిటీ ఉన్న మేనేజర్ పాత్రలో కనిపిస్తుండగా హీరోయిన్ నభా నటేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా కనిపించనున్నారు. ఈ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.