తమిళనాడులో వరలక్ష్మికి ఎనలేని క్రేజ్ ఉంది. ఇంతకి వరలక్ష్మి అంటే ఎవరు అనే కదా మీ అనుమానం.తమిళ్ సినీయర్ హీరో శరత్ కుమార్, రాధికల గారాల పట్టియే ఈ వరలక్ష్మి.ఈమె హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచియమైంది.హీరో విశాల్తో కొన్నాళ్లు ప్రేమయాణం కొనసాగించింది.తరువాత నడీ సంఘం ఎలక్షన్స్లో తండ్రి శరత్ కుమార్కు విశాల్కు గొడవ కారణంగా వీరిద్దరు దూరం అయ్యారు.ఇప్పుడు వరలక్ష్మి వరుస సినిమాలు చేస్తు బిజి బిజిగా ఉంది. ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ 62వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వ్యవసాయం, రాజకీయం కలబోసిన కథతో ఈ చిత్రం తయారవుతోంది.
ఇందులో పలువురు నటీనటులు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా రాధారవి, పళ.కరుప్పయ్య రాజకీయ నేతలుగా నటిస్తున్నారు.ఓ ప్రధాన పాత్రలో వరలక్ష్మి నటిస్తున్నారు. అయితే ఆమె పాత్ర ఏమిటనే విషయం ఇప్పటివరకు బయటకు పొక్కలేదు. ఈ నేపథ్యంలో ఆమె పాత్ర గురించి తాజాగా విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో వరలక్ష్మి రాజకీయవాదిగా నటిస్తున్నారని తెలిసింది. ఈ పాత్రతో సినిమా కథ అనూహ్య మలుపులు తిరుగుతోందని, అందువల్ల ఈ చిత్రం వరలక్ష్మి సినీ ప్రస్థానంలో కీలకంగా మారనుందని కోలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.