ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్గా తీస్తున్నాడు త్రివిక్రమ్.ఇది పూర్తిగా రాయలసీమ యాసలో ఉంటుందని సమాచారం.అయితే షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమా యూఎస్ రైట్స్ కళ్లు చెదిరే అమౌంట్కు అమ్మడు కావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ సినిమాకు 12 కోట్లు ముట్టినట్టు తెలుస్తుంది.ఇది ఎన్టీఆర్ కేరీర్లోనే ఇది రికార్డు.ఇక ఈ సినిమాకు త్రివిక్రమ్ స్నేహితుడు రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఎన్టీఆర్కు జంటగా జిగేల్ రాణి పూజ హెగ్డే చేస్తుంది.ఈ సినిమాకి ‘అసామాన్యుడు’ అనే టైటిల్ ను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ టైటిల్ కి ఫీడ్ బ్యాక్ సరిగ్గా రాకపోవడంతో త్రివిక్రమ్ మనసు మార్చుకున్నాడట. కొత్తదనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి ‘రా రా కుమారా’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. దసరాకి ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్.