Friday, April 26, 2024
- Advertisement -

చిన్నవయసులో ఆ పని తెలియక చేశానంటున్న నటి?

- Advertisement -

బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటి హూమా ఖురేషి బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. చేసింది కొన్ని సినిమాలే అయినా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ క్రమంలోనే తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంటే ప్రతి ఒక్కరికి ఎంతో అభిమానం. క్రికెటర్లు సైతం అతనికి అభిమానులుగా మారిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తరువాత కూడా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే బాలీవుడ్ నటి హూమా ఖురేషి మాత్రం సచిన్ పోస్టర్లు చింపేసేదానినని తెలిపారు.

Also read:ఇంద్రభవనంలాంటి సమంత ఇల్లు.. మీరు ఎప్పుడైన చూశారా?

బాలీవుడ్‌ దర్శకుడు సాజిద్‌ ఖాన్‌, హీరో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్న “యారోంకి బారాత్‌” అనే చాట్‌ షోలో హూమా పాల్గొంది. ఈ కార్యక్రమం ద్వారా చిన్నప్పుడు తన సోదరుడితో జరిగిన గొడవ గురించి తెలిపింది. తన సోదరుడికి సచిన్ అంటే ఎంతో పిచ్చని, తనతో గొడవ పడటం వల్లే తను ఎంతగానో ఇష్టపడే సచిన్ ఫోటోలను చింపేశానని ఆమె పేర్కొన్నారు. సచిన్ పోస్టర్లో చింపడం గురించి హోస్ట్ అడిగినప్పుడు తన ఎంతో ఇబ్బంది పడ్డానని… చిన్నతనంలో తెలియక అలా చేశానని, నేను సచిన్ పోస్టర్ చింపానని దానికి ప్రతీకగా తన సోదరుడు కూడా తన అభిమాన క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ పోస్టర్లు చింపేశాడని వెల్లడించింది.

Also read:ఈ సీరియల్స్ హీరోయిన్స్ అసలు వయసు ఎంతో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -