Tuesday, April 30, 2024
- Advertisement -

పచ్చి నిజం అంటూ జబర్దస్త్ భజన భారీగా చేస్తున్న ఇంద్రజ..!

- Advertisement -

బుల్లితెర ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ కార్యక్రమం కొన్ని వందల మందికి జీవితాన్ని ఇచ్చిందని ఎన్నో సందర్భాలలో చెప్పటం మనం వింటూనే ఉంటాం. అయితే కొన్ని సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మల్లెమాల వారు కమెడియన్ లను తమ అగ్రిమెంట్ ల ద్వారా బంధించి వేధించేదనే వార్తలు కూడా వినిపించాయి.ఈ క్రమంలోనే ముక్కు అవినాష్ జబర్దస్త్ షో నుంచి బిగ్ బాస్ కి వెళ్ళడం కోసం మల్లెమాల వారు అనుమతి ఇవ్వకపోగా అతని నుంచి 10 లక్షల రూపాయలు తీసుకున్నారని ఎన్నోసార్లు బిగ్ బాస్ ద్వారా తెలిపారు.

ఈ మధ్యకాలంలో మల్లెమాల, జబర్దస్త్ షో గురించి ప్రచారం చేయడం ఎక్కువగా జరుగుతుంది. ఈ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చిందని , ఈ షో తమను ఈ స్థాయిలో నిలబెట్టిందని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం గురించి భజన చేయడం ఎక్కువైంది. ఇక తాజాగా ఈ వారంలో ప్రసారం కాబోయే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ ఏకంగా బండ్ల గణేష్ ని తలపించే డైలాగులు చెప్పాడు.ఈశ్వరాఎంత కమెడియన్లయ్యా మీరుతోపులు నాకు తెలిసి 8సంవత్సరాల క్రితం అనుకుంటా.. ఫిబ్రవరి 2012ఓ అద్భుతం జరిగింది.. అద్భుతం జరగకముందు ఎవ్వరూ గుర్తించరు.. జరిగిన తరువాత ఎవ్వరూ గుర్తించాల్సిన అవసరం లేదు.. ఆ అద్భుతమే జబర్దస్త్.. అంటూ తనకు జబర్దస్త్ పట్ల ఉన్న భక్తిని చాటుకున్నాడు.

Also read:వామ్మో.. అల్లరి నరేష్ సినిమాలో దారుణమైన బూతులు..!

ఈ క్రమంలోనే టీం లీడర్లు హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, సుడిగాలి సుదీర్, గెటప్ శీను, ప్రతి ఒక్కరు ఈ షో గురించి భజన చేయడం ప్రారంభించారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ కూడా నేను ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు అయింది.ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను ఇంతగా అభిమానించే వాళ్ళు ఉన్నారా అని ఈ జబర్దస్త్ కార్యక్రమం నాకు తెలియ జేసింది ఇది పచ్చి నిజం అంటూ జబర్దస్త్ లో తాను కూడా ఒక భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఇంద్రజ సైతం జబర్దస్త్ భజన చేశారు.

Also read:అనుపమ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -