Sunday, May 12, 2024
- Advertisement -

జై లవకుశ హీరోయిన్స్ కి బిగ్ బాస్ హౌస్ లో ఏం పని..?

- Advertisement -

ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో ఫస్ట్ సీజన్ కంప్లీట్ కావడానికి దగ్గరికి వచ్చింది. మరో వారంల్లో ఈ సీజన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోనుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో స్టార్స్ వచ్చి తమ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు.

రానా, తాప్సి, సచిన్, సునీల్ ఇలా స్టార్స్ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడం కోసం బిగ్ బాస్ హౌస్ ను ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఇదే బాటలో జై లవకుశ హీరోయిన్స్ రాశిఖన్నా , నివేద థామస్ లు చేయబోతున్నారు. శనివారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో రాశీఖన్నా, నివేదా థామస్ కనిపిస్తారు. శనివారం ఎన్టీఆర్ కూడా ఉంటాడు కాబట్టి రాశీఖన్నా, నివేదా బిగ్‌బాస్‌లోకి వెళ్లడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ ఈ నెల 21న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో శని, ఆది రెండు రోజులూ బిగ్‌బాస్‌లో ‘జై లవకుశ’ ప్రమోషన్స్ ఉండబోతున్నట్లు అర్ధం అవుతుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మరింతగా జనాల్లోకి వెళ్లి సినిమా ఫై ఇంకాస్త అంచనాలు పెరగడం పక్కాగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -