టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వరస హిట్స్తో మంచి ఫామ్ లోకి వచ్చిన ఎన్టీఆర్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వం లో ‘జై లవకుశ‘ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా స్టార్ట్ అయిన ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఫై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాబినయం చేస్తున్నాడు. మొదటి సారి ఎన్టీఆర్ ఇలా కనిపిస్తుండడం తో సినిమా ఫై ఇప్పటినుండే అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఆ అంచనాలకు తగట్టే సినిమాని తెరకెక్కిస్తున్నాడు కళ్యాణ్ రామ్. అయితే ఓ బడా నిర్మాత ఎవరు ఊహించని రీతిలో ఈ సినిమాకి భారీ ఆఫర్ ఇచ్చాడని టాక్. ఈ మూవీ థియెట్రికల్ రైట్స్ను ఏకంగా 85 కోట్లకు కొనుగోలు చేయడానికి ఓ బడా నిర్మాత ముందుకొచ్చాడట. ఈ మేరకు కళ్యాణ్ రామ్తో సదరు నిర్మాత చర్చలు కూడా జరిపాడని , కావాలంటే మరో ఐదు కోట్లు ఎక్కువగా ఇవ్వడానికి కూడా ఆయన రెడీ గా ఉన్నాడట.
కాకపోతే కళ్యాణ్రామ్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు సినీ వర్గాలు. ఒకవేళ ఇది నిజమైతే టాలీవుడ్ రికార్డ్స్ ను తిరగరాసిన వాడిగా ఎన్టీఆర్ పేరు వినపడుతుంది. ఆగస్టులో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా రాశిఖన్నా ను సెలెక్ట్ చేయగా.. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.
Related