Sunday, April 28, 2024
- Advertisement -

కమల్​తో గౌతమి జత కడుతుందా?

- Advertisement -

‘ఓ మధ్యతరగతి కుటుంబంలో అనుకోని పరిస్థితి ఎదురైతే ఆ కుటుంబం ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కొంది’ అనే లైన్​తో జీతూ జోసెఫ్​ మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం బంపర్​ హిట్​ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రానికి జేజేలు పలికారు. ఇదే సినిమాను తమిళంలో కమల్​ హాసన్, గౌతమి జోడిగా, ఇక తెలుగులో వెంకటేశ్​, మీనా జోడిగా రీమేక్​ చేస్తే బంపర్​ హిట్​ అయ్యింది. తెలుగు వెర్షన్ కి శ్రీప్రియ దర్శకత్వం వహించగా, తమిళ వర్షన్ పాపనాశం కు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. అయితే మలయాళంలో దృశ్యం- 2సీక్వెల్​ తెరకెక్కించి విడుదల చేశారు. అక్కడ దృశ్యం-2 కూడా సూపర్​ హిట్​ అయ్యింది.

Also Read : విజయ్​ సేతుపతి వదులుకున్న పాత్రకు చైతూకి.. వర్కవుట్​ అవుతుందా?

ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తోనే వెంకటేష్ ఆ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా లాక్​డౌన్​ తో విడుదల కాలేదు.ఇదిలా ఉంటే దృశ్యం 2ను తమిళంలో పాపనాశం -2గా రీమేక్​ చేయబోతున్నట్టు సమాచారం. పాపనాశంను తమిళంలో తెరకెక్కించిన జీతూ జోసెఫ్​.. సీక్వెల్​ కు డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే మొదటి భాగంలో నటించిన గౌతమి.. ఇప్పుడు సీక్వెల్​లో నటిస్తుందా? లేదా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే గౌతమి.. అప్పట్లో కమల్​హాసన్​తో లివ్​ఇన్​ రిలేషన్​ షిప్​లో ఉండేది. ఆ టైంలో దృశ్యం తెరకెక్కింది. కానీ ఆ తర్వాత కమల్​తో ఆమె విడిపోయింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు గౌతమి సీక్వెల్​లో నటిస్తుందా? లేక కొత్త నటిని తీసుకొస్తారా? అన్న విషయం ఆసక్తి కరంగా మారింది. అయితే ఈ సినిమాలో గౌతమికి బదులుగా మీనా లేదా ఇతర హీరోయిన్ ను తీసుకోవాలని కమలహాసన్ డైరెక్టర్ కు విజ్ఞప్తి చేశాడని తెలిసింది.

Also Read: హీరోలు, నటులకు గట్టి క్లాస్​పీకిన మనోజ్​ బాజ్​పాయ్​..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -