‘ఓ మధ్యతరగతి కుటుంబంలో అనుకోని పరిస్థితి ఎదురైతే ఆ కుటుంబం ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కొంది’ అనే లైన్తో జీతూ జోసెఫ్ మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం బంపర్ హిట్ అయ్యింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రానికి జేజేలు పలికారు. ఇదే సినిమాను తమిళంలో కమల్ హాసన్, గౌతమి జోడిగా, ఇక తెలుగులో వెంకటేశ్, మీనా జోడిగా రీమేక్ చేస్తే బంపర్ హిట్ అయ్యింది. తెలుగు వెర్షన్ కి శ్రీప్రియ దర్శకత్వం వహించగా, తమిళ వర్షన్ పాపనాశం కు జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించాడు. అయితే మలయాళంలో దృశ్యం- 2సీక్వెల్ తెరకెక్కించి విడుదల చేశారు. అక్కడ దృశ్యం-2 కూడా సూపర్ హిట్ అయ్యింది.
Also Read : విజయ్ సేతుపతి వదులుకున్న పాత్రకు చైతూకి.. వర్కవుట్ అవుతుందా?
ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ తోనే వెంకటేష్ ఆ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా లాక్డౌన్ తో విడుదల కాలేదు.ఇదిలా ఉంటే దృశ్యం 2ను తమిళంలో పాపనాశం -2గా రీమేక్ చేయబోతున్నట్టు సమాచారం. పాపనాశంను తమిళంలో తెరకెక్కించిన జీతూ జోసెఫ్.. సీక్వెల్ కు డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే మొదటి భాగంలో నటించిన గౌతమి.. ఇప్పుడు సీక్వెల్లో నటిస్తుందా? లేదా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.
ఎందుకంటే గౌతమి.. అప్పట్లో కమల్హాసన్తో లివ్ఇన్ రిలేషన్ షిప్లో ఉండేది. ఆ టైంలో దృశ్యం తెరకెక్కింది. కానీ ఆ తర్వాత కమల్తో ఆమె విడిపోయింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు గౌతమి సీక్వెల్లో నటిస్తుందా? లేక కొత్త నటిని తీసుకొస్తారా? అన్న విషయం ఆసక్తి కరంగా మారింది. అయితే ఈ సినిమాలో గౌతమికి బదులుగా మీనా లేదా ఇతర హీరోయిన్ ను తీసుకోవాలని కమలహాసన్ డైరెక్టర్ కు విజ్ఞప్తి చేశాడని తెలిసింది.
Also Read: హీరోలు, నటులకు గట్టి క్లాస్పీకిన మనోజ్ బాజ్పాయ్..!