- Advertisement -
ఒకరే హీరోగా నటించిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఇద్దరు టాప్ హీరోలు కలసి తీసే సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఎలా అంటే గతంలో ఎన్టీఆర్,నాగేశ్వరరావు,కృష్ణ,కృష్ణమరాజు,శోభన్ బాబులు కాంబినేషన్ లో చాల సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇటివల కాలంలో వెంకీ మల్టీస్టార్ సినిమాలను బాగా ప్రోత్సహిస్తున్నాడు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకీట్లో సిరిమల్లె చెట్టులో వెంకీ,మహేష్ బాబులు నటించిన విషయం తెలిసిందే. తరువాత పెద్ద హీరోలు కలసిన మల్టీస్టార్ సినిమాలు రాలేదు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్,స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ మల్టీ స్టార్ సినిమా తీసేందుకు దర్శకుడు పూరి జగన్నాథ్ ముందుకు వచ్చాడు. కథా చర్చలు కూడా పూర్తి అయ్యాయని, నిర్మాత దొరికితే సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.