ఎన్టీఆర్, త్రివిక్రమ్ వీరిద్దరి కాంబినేషన్లో సినిమాను కొంత కాలం క్రిందట భారీగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ చిత్రానికి లేటెస్ట్ సమాచారం ఏమిటి అంటే మార్చి నెల మూడో వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.
తారక్ ఈ సినిమాలో కొత్త లుక్లో కనిపించబోతున్నారని టాక్. హీరోని కొత్తగా చూపించేందుకు స్పెషల్ మేకప్ ఆర్టిస్ట్ను పిలిపిస్తున్నారు. హాలీవుడ్లో ఫేమస్ అయిన వాన్స్ హార్ట్వెల్ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుదనేది మాత్రం సస్పెన్స్ అంటోంది మూవీ టీమ్. ఈసినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త డిఫరెంట్లుక్లో సర్ప్రైజ్ ఇస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గానే ఈ మూవీని తెరకెక్కించబోతున్నారు. అజ్ఞాతవాసి మూవీతో టాలీవుడ్కు పరిచయమైన అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్లో హీరోయిన్ ఎవరన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. అయితే పూజా హెగ్డే, అను ఇమ్మాన్యుయేల్తో పాటు శ్రధ్ధా కపూర్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో మూవీపై ఫ్యాన్స్లో భారీ అంచనాలే ఉన్నాయి. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయని సమాచారం.