Saturday, April 20, 2024
- Advertisement -

మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌నున్న ద‌ర్శ‌కేంద్రుడు

- Advertisement -

క్లాసిక్‌.. మాస్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు తీసి అన్నీ సూప‌ర్‌హిట్లు తీసే దర్శ‌కుడిగా కె.రాఘ‌వేంద్ర‌రావు మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్ట‌నున్నాడ‌ని స‌మాచారం. తెలుగులో వందకు పైగా సినిమాలకు దర్శకత్వం చేసిన కె.రాఘవేంద్రరావు ఇప్పుడు మ‌రో సినిమాను ప్రారంభించే ప‌నిలో బిజీగా ఉన్నారు. ఆయ‌న తీసిన వంద సినిమాల్లో ఎక్కువ సినిమాలు సూప‌ర్ డూప‌ర్ హిట్లుగా నిలిచాయి. హిట్లు.. బ్లాక్ బస్టర్లు.. సూపర్ హిట్లు అన్నీ రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాల‌తో వ‌చ్చిన పేర్లు అవ‌న్నీ.

కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న దర్శకేంద్రుడు గ‌త సినిమాలు ఎక్కువ‌గా భక్తిరస.. ఆధ్యాత్మిక సినిమాలు చేశారు. చివరగా ఆయన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమా తీశారు. రాఘవేంద్రరావు త్వరలోనే మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. విక్టరీ వెంకటేశ్‌, సునీల్‌తో ఆధ్యాత్మిక సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించి వర్క్ నడుస్తోందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. వెంకీ, సునీల్ కానీ ఇప్పటిదాకా ఆధ్యాత్మిక చిత్రాల్లో నటించలేదు.

వీళ్లకు ఆ తరహా సినిమాలు సూటవుతాయో లేదో కూడా చెప్పలేం. హీరోగా వరుస వైఫల్యాల నేపథ్యంలో మళ్లీ కామెడీ వేషాలకు సునీల్ సిద్ధమవుతున్న స‌మ‌యంలో దర్శకేంద్రుడు ఇప్పుడు మ‌రో ఆధ్యాత్మిక సినిమా చేయాలని ప‌క్కా క‌థ‌తో ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -