Wednesday, May 15, 2024
- Advertisement -

బిగ్‌బాస్‌లో జ‌య‌ల‌లిత‌కు అవ‌మానం

- Advertisement -

త‌మిళ బిగ్‌బాస్‌ను వివాదాలు వ‌ద‌ల‌డం లేదు.త‌మిళ బిగ్‌బాస్‌పై మ‌రో కేసు న‌మోదైనట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే…త‌మిళ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. క‌మ‌ల్ హాస‌న్ బిగ్‌బాస్‌లో దివంగత ముఖ్యమంత్రి జయలలితను ‘డిక్టేటర్’గా సంబోధించి అవమానించారంటూ ఆయ‌న‌పై ఫిర్యాదు నమోదైంది. హౌస్‌లోని కంటెస్ట్ అయిన ఐశ్వర్య జయలలితను డిక్టేటర్‌గా  అన‌డ‌మే కాకుండా….జయలలిత డిక్టేటర్‌గా వ్యవహరించి రాష్ట్రాన్ని పాలించారని ఆరోపించింది.

ఆమెకు మ‌ద్ద‌తుగా క‌మ‌ల్ కూడా జయను అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ మద్రాస్ హైకోర్టు అడ్వకేట్ లౌసీల్ రమేశ్ గ్రేటర్ చెన్నై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.కమల్ తన రాజకీయ ప్రయోజనాలకు షో వాడుకుంటున్నార‌ని,దీనిలో భాగంగానే ఆయ‌న జ‌య‌ల‌లిత‌పై కామెంట్స్ చేశార‌ని అందులో పేర్కొన్నారు. క‌మల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని లౌసీల్ రమేశ్ డిమాండ్ చేశారు. జయలలితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టుగా చెబుతున్న షో రేపు ప్రసారం కానుంది.ఇప్ప‌టికే అనేక వివాద‌ల న‌డుమ త‌మిళ బిగ్‌బాస్ న‌డుస్తుంది.తాజాగా ఈ వివాదం నుండి క‌మ‌ల్ ఎలా బ‌య‌ట‌ప‌డ‌తారో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -