పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అభిమానుల కోసం పవన్ కాటమరాయుడు సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా పై ఇప్పుడు పవన్ అభిమానులో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ఇక ఈ సినిమాకి సంబంధించి టీజర్ ఈ రోజు రీలీజ్ అయ్యింది. పవన్ ఈ సినిమాలో చాలా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. పవన్ చేప్పిన డైలాగ్.. ఎంతమంది ఉన్నారు అన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నది ముఖ్యం అంటూ పవన్ చెప్పిన ఈ డైలా అదరహో అనేలా ఉంది.
ఇక ఈ సినిమాలో పవన్ తన తమ్ముల కోసం ఏం చేసాడు అనే కథ పై సినిమా నడుస్తుందని తెలుస్తోంది. ఇక పవన్ సరసన ఈ సినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపాల గోపాల సినిమాకి దర్శకత్వం వహించిన డాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అనుప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి టీజర్ ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి.
Related