Tuesday, May 14, 2024
- Advertisement -

మ‌హేష్‌, బ‌న్నీల‌ను మించిపోయిన మ‌హ‌న‌టి

- Advertisement -

అల‌నాటి తార సావిత్రి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.సావిత్రి పాత్ర‌ను హీరోయిన్ కీర్తి సురేష్ పోషిస్తుంది.ఈ సినిమా మే 9న విడుదలవుతోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఈ సినిమా నిడివి గురించి ఇప్పుడు చ‌ర్చ న‌డుస్తుంది.దాదాపుగా మూడు గంటల నిడివితో మహానటి ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు భరత్‌ అనే నేను 2 గంటల 53 నిమిషాల నిడివితో రిలీజ్‌ అయ్యింది.

అల్లు అర్జున్‌ నా పేరు సూర్య 2 గంటల 48 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ రెండు సినిమాల కన్నా మహానటి నిడివి ఎక్కువగా ఉండనుంది. 2 గంటల 56 నిమిషాల నిడివితో మహానటి విడుదలకు రెడీ అయ్యింది. మ‌రి ఇంత నిడివి ఉన్నా మ‌హ‌న‌టి ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఈ సినిమాలో స‌మంత‌,విజ‌య్ దేవ‌ర‌కొండ‌,మోహ‌న్ బాబు,అవ‌స‌రాల శ్రీనివాస్‌, ద‌ర్శ‌కుడు క్రిష్‌,షాలీని పాండే,త‌దిత‌రులు న‌టించారు.ఈ సినిమా రెండు భాష‌ల‌లో విడుద‌ల కానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -