- Advertisement -
దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా కాటుకు బలి అవుతున్న విషయం తెలిసిందే. ఇక కరోనా ప్రభావం ఎక్కువగా సినీ, రాజకీయ నేతలపై చూపిస్తుంది. ఇప్పటికే పలువురు సిసీ సెలబ్రెటీలు కన్నుమూశారు.
నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం…
మొన్నటి నుంచి టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నిర్మాత ముత్తు అలియాస్ ముత్తకుమరన్ కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో ఈయన శనివారం మరణించినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కుళందై వేలప్పన్ దర్శకత్వం వహించిన ‘యాకై’ చిత్రానికి ముత్తకుమరన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా, హీరో ధనుష్, చిన్మయి, తాన్వీషా నేపథ్యగానం చేశారు.