Friday, May 17, 2024
- Advertisement -

కోనా వెంకట్ ని మర్చిపోవచ్చు :

- Advertisement -

గత పదిహేను సంవత్సరాలలో ఏ రైటర్ కీ రాని స్టార్ కేటగిరీ తెచ్చుకున్నాడు కోనా వెంకట్. ఆయన పేరు థియేటర్ లలో కనపడితే ఆడియన్స్ లో కూడా విపరీతమైన ఆసక్తి సినిమా మీద రేగేది. ఆ రేంజ్ లో పేరు తెచ్చుకున్న కోనా వెంకట్ శ్రీను వైట్ల తో గొడవలు పడిన తరవాత తలరాత సరిజేసుకోలేక పోతున్నాడు. వరస ప్లాపులతో గీతాంజలి లాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు.

అయితే ఆయన తీసిన శంకరాభరణం ప్రొడ్యూసర్ గా ఆయన్ని తీవ్రంగా లాస్ చేసింది. ప్రస్తుతం నాగ చైతన్య సినిమా సాహసం శ్వాసగా సాగిపో తెలుగు వెర్షన్  కి నిర్మాతగా చేస్తూ. పీఆర్వో గా కూడా తానే ఈ సినిమాకి తెలుగు లో చేస్తున్నాడు. ఈ సినిమా మీద కోనా విపరీతమైన అంచనాలు పెట్టుకున్నాడట. తన దగ్గర ఉన్న సొమ్మంతా దీని మీద పెట్టేసాడు . అప్పు చేసి మరీ ఇప్పుడు తమన్నా ని లీడ్ రోల్ లో పెట్టి అభినేత్రి అనే సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు కోనా వెంకట్.

శంకరాభరణం తరవాత కోనా వెంకట్ చాలా గ్యాప్ తీసుకున్నప్పటికీ తాను ఇన్వాల్వ్ కాని గౌతం మీనన్ సినిమాని నిర్మించడం హర్షించదగ్గ విషయం. ఏదేమైనా రచనలకి ఈయన దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు మరో సినిమా స్టార్ట్ చేసినట్లు కోన వెంకట్ ట్వీట్ ద్వారా తెలిపాడు. ‘ప్రభుదేవా దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్ తో కలిసి పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉంది. కొత్త కథ – కొత్త ప్రయాణం.. సాగుతూ ఉండాలి’ అంటూ జూనియర్ బచ్చన్ – ప్రభుదేవాలతో దిగిన ఒక ఫోటోను కూడా పోస్ట్ చేశాడు కోన. చూస్తుంటే.. ఇక రైటర్ గా కోన వెంకట్ ను మర్చిపోయి.. నిర్మాత కోననే చూడాల్సి వచ్చేట్లుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -