దర్శకుడు కొరటాల శివ తీసిన నాలుగు సినిమాలు హిట్టే. మిర్చి,శ్రీమంతుడు,జనాత గ్యారేజ్, భరత్ అను నేను సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేశాయి.కొరటాల ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరక్టర్.ఇండస్ట్రీ కళ్లు అన్ని ఇతని తరువాత సినిమాపైనే ఉన్నాయి.అయితే కొరటాల మాత్రం కొంత గ్యాప్ తీసుకుని తన తరువాత సినిమా ఫోకస్ చేయాలని చూస్తున్నాడు.ఇక్కడ కొరటాల దర్శకుడిగా కాకుండా నిర్మాతగా వ్యవహరించాలని అనుకుంటున్నాడు.
తన దగ్గర చాలా కథలు ఉన్నాయని వాటిన్నింటిని తాను డైరక్షన్ చేయలేనని భావించిన కొరటాల కొత్త దర్శకులను పరిచియం చేస్తు ఆ సినిమాలకు తానే నిర్మాతగా ఉండలని అనుకుంటున్నాడు.మరి కొరటాల ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.కొరటాల శివ తన తదుపరి సినిమా అల్లు అర్జున్తో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అటు కొరటాల కాని ఇటు బన్నీ కాని స్పందించలేదు.