Sunday, May 5, 2024
- Advertisement -

త్వరలో సెట్స్ పైకి రాయబారి చిత్రం

- Advertisement -

కంచె సినిమాతో సినీ ఆరంగేట్రం చేసిన మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కొత్త చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. తన తొలి చిత్ర దర్శకుడు క్రిష్ దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని కూడా చేయనున్నాడు వరుణ్ తేజ్.

ఈ చిత్రంలో వరుణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రను పోషించనున్నాడు. రాయబారి పేరుతో రానున్న ఈ చిత్రం తన కెరీర్ కు కొత్త మలుపు అవుతుందని వరుణ్ పేర్కొన్నాడు. ఇప్పటికే స్ర్కిప్ట్ వర్క్ పూర్తి అయిన రాయబారి చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంతో నటునిగా వంద మార్కులు సాధించిన వరుణ్ కొత్త పాత్రలో రాణిస్తారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

ఇద్దరు హీరోయిన్లు ఉండే ఈ చిత్రంలో వారితో పాటు మిగతా నటీనటులను ఎంపిక చేయాల్సి ఉంది. అన్నీ పూర్తి అయితే జూలై నెలలో చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -