టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రిన్స్ మహేష్ బాబు సరసన ‘1 నేనొక్కడినే’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఈ సినిమా తర్వాత అక్కినేని హీరో నాగచైతన్యతో మరోసారి జత కట్టినప్పటికి ఈమెకు తెలుగులో పెద్దగా ఆదరణ దక్కలేదు. దీంతో బాలీవుడ్ వైపు తన దృష్టిసారించిన కృతిసనన్ ప్రస్తుతం ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇప్పటివరకు బాలీవుడ్ లో 12 సినిమాలలో నటించిన కృతి సనన్, ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా కృతి సనన్ తన హిందీలో నటించిన మొదటి చిత్రం హీరో పంతీ’ విడుదలై ఆదివారానికి ఏడేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో తన కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Also read:న్యూడ్ క్లిప్స్ లీక్.. తలెత్తుకోలేని పరిస్థితి అంటూ రాధికా ఆప్టే ఎమోషనల్?
కృతిసనన్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో సినిమాల పట్ల పెద్దగా అవగాహన లేదు. అసలు నటి అవుదామనే ఆలోచన కూడా తనకు లేదని ఈ సందర్భంగా తెలిపారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రం లేకపోవడం వల్ల ఇండస్ట్రీలో తనని ఎవరూ పలకరించేవారు కాదని, ఆ సమయంలో తను ఒంటరి అనే భావన ఎప్పుడూ తనని వేదించేదని తెలిపారు. ప్రస్తుతం నేను ఇండస్ట్రీలో నాలుగు మెట్లు పైకి ఎక్కాను. అయితే అది ఎంతో సులభంగా వచ్చిన ఫలితం కాదని దాని వెనుక ఎన్నో బాధలు, అవమానాలు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ‘హీరోపంతీ’ గురించి చెబుతూ ‘‘ఏడేళ్ల ‘హీరో పంతీ’, పరిశ్రమలో ఏడేళ్ల వయసు, ఈ ఏడేళ్ల జర్నీ ఎంతో అందంగా ఉందని ఎవరికైనా తమ మొదటి సినిమా ఒక అద్భుతమని, ఆ సినిమా తనకు ఎప్పటికీ స్వీట్ మెమరీ అంటూ… గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.