జర్మనీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీని బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా కలుసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఎంత వివాదం రేపిందో తెలిసిందే. కాగా ప్రధాని నరేంద్రమోదీతో జర్మనీలో కలుసుకున్నప్పటి ఒక ఫోటోను సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా షేర్ చేయడంతో నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఒక దేశ ప్రధానితో ఎలా నడుచుకోవాలో తెలియదా అంటూ ప్రియాంకపై విమర్శల పర్వం కురిపించారు.
ప్రియాంక ధరించిన దుస్తులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.ప్రియాంకాకు బాలివుడ్నుంచి సపోర్ట్ లభించగా నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు.అటు ఈ వ్యవహారంపై కమెంట్ చేయడానికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా సుతిమెత్తగా తిరస్కరించారు. దీనిపై స్పందించడానికి తాను ప్రధాని కాననీ, అలాగనీ ప్రియాంక చోప్రాను కూడా కాదంటూ ఈ అంశానికి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
{loadmodule mod_custom,GA2}
బెర్లిన్లో మోదీతో జరిగిన భేటీలో ప్రియాంక దుస్తులపై దుమారం, సభ్యతను, సంప్రదాయాలను కించపరిచేలా దుస్తులు ధరించిందంటూ వ్యక్తమైన అభిప్రాయాలపై హాలీవుడ్ హాట్ నటి సన్నీలియేన్ స్పందించారు. ఏ దుస్తులు ధరించాలి అనేది ప్రియాంక యిష్టమని, వేసుకున్న దుస్తులను కాకుండా, వారి చర్యలను చూడాలని కోరారు. మనం ఒకర్నొకరు ప్రేమించుకోవాలి తప్ప ద్వేషించు కోకూడదని సన్నీ లియేన్ తెలిపారు.
ముంబైలో పెటా ఆధ్వర్యంలో గో వెజిటేరియన్ క్యాంపెయిన్ సందర్భంగా సన్నిలియోన్ మాట్లాడుతూ.. అత్యంత హుందాతనం ఉన్న వ్యక్తిని భారత ప్రధానిగా ఎన్నుకొన్నాం. ఆయన ఏ విషయంపైనైనా నిక్కచ్చిగా మాట్లాడుతారు. కుండ బద్దలు కొట్టినట్టు చెపుతారంటూ ప్రియాంకకు బాసటగా నిలిచారు. ఎంతైనా ఇద్దరూ ఇద్దరే కదా..
{loadmodule mod_sp_social,Follow Us}
Related