యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న సలార్ మూవీపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ను ఇప్పటికే స్టార్ట్ చేసింది. దీనికి కేజీఎఫ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూట్ గోదావరి ఖనిలోని బొగ్గుగనిలో జరుగుతోంది.
ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ ఎవరనేది చాలా రోజుల నుంచి చర్చ జరుగుతోంది. ప్రతినాయకుడిగా పలువురు నటిస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ.. చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ఎవరి పేరు చెప్పలేదు. అయితే దీనిపై ఒక క్లారిటీ మాత్రం వచ్చేసింది. సలార్ లో నటిస్తున్నానని.. కన్నడ నటుడు మధూ గురుస్వామి సోషల్ మీడియాలో ఆ మధ్య ఒక పోస్ట్ పెట్టాడు.
ఆ పోస్ట్ లో ఆయన పలు విషయాలను పంచుకున్నాడు. సలార్ సినిమాలో నటించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దాన్ని మీతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పోస్ట్ లో తెలిపాడు. అలాగే ఇలాంటి సువర్ణ అవకాశాన్ని అందించిన దర్శకుడికి, నిర్మాతకు, నిర్మాణ సంస్థలకు ధన్యవాదాలని తెలిపాడు. దీంతో మధూ గురుస్వామి సలార్ విలన్ అని నెట్టింట్లో ప్రచారం జరుగుతోంది.