Monday, April 29, 2024
- Advertisement -

20 రోజుల పాటు ప్ర‌చారం చేయ‌నున్న ముఖ్య‌మంత్రి

- Advertisement -

కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు న‌టిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. ఇటీవ‌లే బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న‌ట్టుగా మ‌హేశ్‌బాబు వీడియో విడుద‌ల చేశారు. రాజ‌కీయాల నేప‌థ్యంలో రూపొందుతున్నఈ సినిమాలో మ‌హేశ్ ముఖ్య‌మంత్రిగా క‌నిపించ‌నున్నారు. అయితే ఇప్పటికే ఫస్ట్ ఓత్‌, విజన్ ఆఫ్ భరత్ లాంటి పేర్లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న మ‌హేశ్ ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ప్ర‌చారం చేస్తున్నారు.

భరత్ అనే నేను సినిమాకు ఏకంగా 20 రోజుల పాటు ఎక్స్‌క్లూజివ్‌గా ప్ర‌చారం చేయాలని నిర్ణయించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సినిమా విడుదలైన రోజు వరకు ఏదో ఒక రూపంలో ఈ సినిమా ప్రచారం చేయ‌నున్నారు. 20 రోజులకు సరిపడా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధ‌మైంది. ప్రేక్షకుల్ని ఆకర్షించడం కోసం ప్రతి రోజు ఏదో ఒకటి కొత్తగా చేయనున్న‌ట్టు స‌మాచారం.

సోషల్ మీడియా బృందంతో మార్చేశాడు మహేష్. కొత్త టీం వచ్చిన తర్వాత సరికొత్త ప్రచార కార్యక్రమాలు తెరపైకి వచ్చాయి. వాళ్ల ఆధ్వర్యంలోనే 20 రోజుల పాటు పలు యాక్టివిటీస్ చేయ‌నున్నార‌ట‌. మరోవైపు ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్లు, ప్రీ-రిలీజ్ ఫంక్షన్లు కూడా చేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్త‌వుతుంది. రెండు పాట‌లు లండన్ షెడ్యూల్ పూర్త‌యితే సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు ఈ సినిమా బృందం రానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -