Monday, May 6, 2024
- Advertisement -

కోలీవుడ్‌లో ఏడు త‌రాలు వెతుకుతాడంటా

- Advertisement -
  • బ్ర‌హ్మోత్స‌వం త‌మిళ్‌లో రీమేక్‌
  • ముగ్గురు భామ‌ల‌తో ప్రిన్స్ స‌య్యాట‌

దూర‌మైన బంధువుల‌ను ద‌గ్గ‌ర‌గా చేసుకుందామ‌ని.. వారంద‌రినీ ప‌ల‌క‌రిద్దామ‌ని… ఏడు త‌రాల‌ను క‌లిసి వ‌ద్దామ‌నే ఇతివృత్తంతో బ్ర‌హ్మోత్స‌వం సినిమా తీశారు. ఆ సినిమాలో ప్ర‌ముఖ న‌టులంద‌రూ మెరిశారు. ఆ సినిమా ఎన్నో అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందు రాగా వెండితెర‌పై మాత్రం నిల‌బ‌డ‌లేదు. ప్రేక్ష‌కులు, అభిమానుల‌కు ద‌ర్శ‌కుడు నిరాశ ప‌రిచాడు. అంద‌రూ త‌మ న‌టానుభ‌వాన్ని అంతా ఉప‌యోగించి న‌టించ‌గా ద‌ర్శ‌కుడు స‌క్ర‌మంగా తీయ‌క‌పోవ‌డంతో ఆ సినిమా మ‌హేశ్ చిత్రాల్లో పెద్ద డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

ఆ సినిమానే త‌మిళుల‌కు తెగ న‌చ్చిందంట‌. ఆ సినిమాను అనిరుధ్ పేరిట రీమేక్ చేస్తార‌ట‌. ఈ సినిమాలో మ‌హేశ్‌బాబే న‌టిస్తున్న‌ట్లు చిత్ర నిర్మాత‌లు వెల్ల‌డించారు. త‌మిళ‌నాడు వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో స్వాతి, వర్షిణిల భద్రకాళీ ఫిలింస్‌ అధినేత భద్రకాళీ ప్రసాద్‌, సహ నిర్మాతలుగా సత్యాసీతల, అడ్డాల వెంకట్రావు ఉండ‌నున్నారు. రత్నవేల్‌ ఛాయాగ్రహణం, మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తారు. అనువాద బాధ్యతలను ర‌చ‌యిత ఏఆర్‌కు.రాజరాజన్‌ నిర్వహిస్తున్నారు.

మ‌హేశ్ ఈ సినిమాలో ముగ్గురు భామ‌ల‌తో న‌టిస్తార‌ని ప్ర‌క‌టించారు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, స‌మంత‌, ప్ర‌ణీతతో ఆడిపాడ‌నున్నారు. ప్రేమానుబంధాలు, కుటుంబ నేప‌థ్యంలో ఉన్న సినిమా కావ‌డంతో త‌మ‌కు న‌చ్చింద‌ని తెలిపారు.

https://www.youtube.com/watch?v=IQgbdLUarx4

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -