Sunday, May 12, 2024
- Advertisement -

ఈ సారి మ‌హేశ్‌ని ఏం చేస్తాడో?

- Advertisement -

క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న సుకుమార్ ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ హీరోగా రంగ‌స్థ‌లం సినిమాతో సూప‌ర్ హిట్ కొట్టాడు.సుకుమార్ కెరీర్‌లో రంగ‌స్థ‌లం సినిమా ఒక్క‌టే ఫుల్ క్లారిటీతో తీశాడు.అంత‌క‌ముందు ఆయ‌న తీసిన సినిమాలు అన్ని క‌న్‌ఫ్యూజ‌న్‌తో తీసిన‌వే కావడం విశేషం.ఒక సుకుమార్ త‌న తదుప‌రి సినిమాను సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌తో తీస్తున్న సంగ‌తి తెలిసిందే.గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 1 నేనొక్కడినే డిజాస్టర్‌గా నిలిచింది. సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫెయిల్ అయినప్ప‌టికి నేష‌న‌ల్ లేవ‌ల్లో సినిమాకు బాగానే పేరొచ్చింది.

మంచి క‌థ‌ను సుకుమార్ త‌న టేకింగ్‌తో చెడ‌గొట్టాడ‌ని అప్ప‌ట్లో మ‌హేశ్ ఫ్యాన్స్ సుకుమ‌ర్‌పై ఫైర్ అయ్యారు.మ‌ళ్లీ మ‌హేశ్‌తో సుకుమార్‌ సినిమా చేస్తుండ‌టంతో మ‌హేశ్ అభిమానులు భ‌యందోళ‌నలో ఉన్నారు.ఈసారి ఎలాగైనా మ‌హేశ్‌కు హిట్ ఇవ్వ‌ల‌నే క‌సితో ఉన్నాడు సుకుమార్‌. ఇక కథ విషయానికి వస్తే.. తెలంగాణకు సంబందించిన ఒక సాయుధ పోరాటంను ప్రేరణగా చేసుకొని సుకుమార్ కథను అల్లుడుతున్నాడట. భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు చాలా ఉంటాయట.మ‌రి సుకుమార్ ఈసారి మ‌హేశ్‌ను ఏం చేస్తాడో చూడాలి.

https://www.youtube.com/watch?v=RSW99Ot9W9U

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -