Saturday, April 27, 2024
- Advertisement -

ఇండియాపై మహేశ్ ఫోకస్.. త్రివిక్రమ్ అయోమయం ?

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే ” SSMB28 ” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే ప్రారంభం అయి మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీ హోల్డ్ లో పడిందట.

దానికి కారణం కూడా లేకపోలేదు.. మహేశ్ బాబు తన తరువాతి సినిమాను ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మూవీ అంటే పక్కా పాన్ ఇండియా స్థాయిలో రూపొందే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దాంతో త్రివిక్రమ్ మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలో మూవీ స్క్రిప్ట్ పాన్ ఇండియా స్థాయిలో అలరించేందుకు కథలో మార్పులు చేసి మరింత మెరుగులు దిద్దే పనిలో త్రివిక్రమ్ ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. పక్క యాక్షన్ ఓరియెంటెడ్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు చిత్రా యూనిట్ గతంలోనే ప్రకటించింది.

అయితే పాన్ ఇండియా స్థాయిలో అలరించాలంటే ఎమోషన్స్ కు పెద్దపీఠ వేయాల్సిందేనని ” ఆర్ ఆర్ ఆర్, కే‌జి‌ఎఫ్ .. ” వంటి సినిమాలు నిరూపించాయి. దాంతో కథలో బలమైన ఎమోషన్స్ రాసే పనిలో ఉన్నాడట త్రివిక్రమ్. మరి మహేశ్ త్రివిక్రమ్ మూవీ నిజంగానే పాన్ ఇండియా మూవీగా రూపొందే అవకాశం ఉందా ? అనే దానిపై ఎలాంటి అధికారిక సమాచారం లేనప్పటికి.. ప్రస్తుతం ఈ వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో బాగా వైరల్ అవుతున్నాయి. మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్ దాదాపుగా 12 ఏళ్ల గ్యాప్ తరువాత కలిసి చేస్తుండడంతో ఈ మూవీపై సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి వారి అంచనాలకు తగ్గట్టు మూవీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి
అల్లు అర్జున్ రాంపేజ్.. గెట్ రెడీ ?
ఎన్టీఆర్ షార్ట్ విప్పితే.. బొమ్మ బ్లాక్ బస్టరే !
రాంచరణ్.. వాట్ నెక్స్ట్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -