భరత్ అను నేను సినిమా సక్సెస్ను బాగా ఎంజాయ్ చేసిన మహేష్ బాబు, తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 25వ సినిమా కావడంతో ఎంతో ప్రతీష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నారు. సినిమాలో మహేష్ సరికొత్త గెటప్లో కనిపిస్తాడని తెలుస్తుంది. మహేష్ ఇప్పటి వరకు మ్యాన్లీ లుక్లోనే కనిపించాడు.కాని ఈ సినిమాలో మహేష్ గెడ్డంతో కనిపిస్తాడని తెలుస్తుంది.దానిలో భాగంగానే మహేష్ గెడ్డం పెంచే పనిలో పడ్డారని తెలుస్తుంది.
తాజగా దీనికి సంబంధించిన ఫోటో ఒకటి బయటికి వచ్చింది.ఈ ఫోటోలో మహేష్కు లైట్గా గెడ్డం ఉండటాన్ని గమనించవచ్చు. సినిమా షూటింగ్ ఎక్కువుగా విదేశాలలో ఉంటుందని సమాచారం.సినిమాలో మహేష్కు జంటగా పూజా హెగ్డె నటిస్తుంది.వైజయింతి బ్యానర్పై అశ్వినీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=Xz9mrDd42dU&t=3s