భరత్ అనే నేను’ మూవీ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న మహేశ్బాబు అనుకోని సర్ప్రైజ్ అదేంటి అనుకుంటున్నారా…? లండన్లోని మేడమ్ తుస్సాడ్స్లో మహేశ్బాబు మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండటమే ఇందుకు కారణం. ప్రతిష్టాత్మక మేడమ్ తుస్సాడ్స్లో భాగం కాబోతున్నందుకు సూపర్ హ్యాపీగా ఉంది. నా కొలతలను తీసుకోవడానికి వచ్చిన బృందానికి థ్యాంక్స్. వాళ్ల డీటైలింగ్ నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది’’ అన్నారు మహేశ్బాబు. ఈ సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు మహేష్బాబు.
గతంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రెబల్ స్టార్ ప్రభాస్ మైనపు బొమ్మను బ్యాంకాక్లోని మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ఇప్పుడు మహేష్ ఆ అరుదైన గౌరవం దక్కించుకున్నారు. అయితే ప్రిన్స్ బొమ్మను ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది మాత్రం క్లారిటీ లేదు.
మహేశ్కు ఈ గౌరవం దక్కడంతో అభిమానులు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇది వరకు టాలీవుడ్లో హీరో ప్రభాస్కు ఈ గౌరవం దక్కిన విషయం తెలిసిందే. భవిష్యత్లో ఇంకెంతమంది టాలీవుడ్ ఆర్టిస్టులు మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియమ్లో చోటు సంపాదించుకుంటారో చూడాలి