సూపర్స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం భరత్ అను నేను సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా యంగ్ సీఎంగా కనిపిస్తున్నాడు ప్రీన్స్.ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్కు మంచి బజ్ వచ్చింది. ఈ ట్రైలర్ను ఇప్పటికే 50 లక్షలకు పైగా చూశారు.ఈ సినిమాపై కాన్ఫిడేన్స్గా ఉన్నాడు మహేష్ బాబు.ఎవరైనా సినిమా విడుదల అయ్యి హిట్ అయిన తరువాత చిత్ర యూనిట్కు గిప్ట్స్ ఇస్తారు. కాని మహేష్ ఇక్కడ ముందగానే చిత్ర యూనిట్కు గిఫ్ట్స్ ఇచ్చి వారికి సర్ప్రైజ్ ఇచ్చాడు.
భరత్ అనే నేను సినిమాకు సంబంధించి డైరక్షన్ డిపార్ట్ మెంట్ కు కాస్ట్ లీ బహుమతులు అందాయి. మహేష్ తరఫున అతడి భార్య నమ్రతా శిరోద్కర్, దర్శకత్వ విభాగంలో సభ్యులు ఒక్కొక్కరికి లక్ష రూపాయల ఖరీదు చేసే ఐఫోన్-ఎక్స్ ను బహుమతిగా అందించారు.మహేష్, కొరటాల కాంబోలో తెరకెక్కుతోంది భరత్ అనే నేను సినిమా. ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్గా చేస్తుంది.ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలకానుంది.